News August 11, 2024

ఏలూరులో ఇంటర్ విద్యార్థినికి ప్రేమ పేరిట వేధింపులు

image

ఇంటర్ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాపులపాడు మండలం వేలేరుకు చెందిన యువతి ఏలూరులోని ఓ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈమెను అదే విలేజ్‌కి చెందిన శ్రీరామ్ నాయక్ కొద్దిరోజులుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి ఆమె తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరామ్‌పై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.

News November 20, 2025

30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్‌లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.