News February 6, 2025

ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్

image

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.

Similar News

News December 12, 2025

ఇంటి చిట్కాలు మీకోసం

image

* గుడ్డులోని సొన కింద పడితే ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మరక ఆనవాళ్ళు ఉండవు.
* గాజు వస్తువులపై ఉప్పు చల్లి నీళ్ళతో రుద్దితే కొత్తగా మెరిసిపోతాయి.
* ఇనుప వస్తువులను ఉప్పుతో రుద్ది పొడి క్లాత్‌తో తుడిచి భద్రపరిస్తే ఎక్కువకాలం మన్నుతాయి.
* నిమ్మరసం, ఉప్పుతో రాగిసామగ్రిని రుద్దితే మెరిసిపోతాయి.
* చీమలు వచ్చే రంధ్రం దగ్గర కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే వాటి బెడద తగ్గుతుంది.

News December 12, 2025

ఎల్లారెడ్డి: 2వ విడత ప్రచారం నేటి సాయంత్రం వరకే

image

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడించారు. 8 మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రం 5 గం.లకు ప్రచార పర్వం ముగియనుంది. 197 సర్పంచి స్థానాల్లో 41 ఏకగ్రీవం కాగా 156 సర్పంచి స్థానాలకు 482 మంది, 1,654 వార్డు స్థానాల్లో 778 ఏకగ్రీవం కాగా 872 వార్డు స్థానాలకు 2,098 మంది బరిలో నిలిచారు. 4 స్థానాలకు నామినేషన్లు రాలేదు.

News December 12, 2025

రామారెడ్డి: కాలభైరవ స్వామి ఆలయం దర్శించుకున్న మంత్రి

image

కామారెడ్డి జిల్లా రామారెడ్డి-ఇస్సన్నపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు హోమం, అభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.