News February 5, 2025
ఏలూరులో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

ఏలూరు నగర సమీపంలోని వంగూరు సివిల్ సప్లైస్ బఫర్ గోదాము, ఏలూరు మండల స్థాయి గోదాములను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాము ఇన్ఛార్జితో కలిసి రికార్డులను పరిశీలించారు. పేదలకు సంబంధించిన సరుకులను సకాలంలో పంపిణీ చేసేలా చూడాలన్నారు. అవకతవకలకు పాల్పడినా, అక్రమాలు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించింది ఇక్కడే..!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలు నగ్నంగా ఆడి పాడాలని రజాకార్ల పాలనలో విస్నూరు దొర ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో అలాంటి ఆకృత్యాలకు సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ విస్నూరు గడి కనిపిస్తోంది. విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు కేంద్రబిందువే ఈ గడి. మాట వినని వారిని రజాకారులతో ఈ గడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టేవారు.
News September 17, 2025
నల్గొండ: రాచకొండల్లో ‘పెళ్లిగుట్ట’.. స్టోరీ ఇదే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ గుట్టలు కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు కేంద్రంగా ఉండేవి. రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే వెంకటనర్సింహారెడ్డి, కృష్ణమూర్తి నాయకత్వంలోని గెరిల్లా దళాలు రక్షణ కోసం రాచకొండకు చేరాయి. గెరిల్లా దళ నేత కృష్ణమూర్తి వివాహం రాచకొండలోనే జరిగింది. ఆనాడు వివాహం నిర్వహించిన గుట్టను ఇప్పటికీ ‘పెళ్లి గుట్ట’గా పిలుస్తుంటారు.
News September 17, 2025
ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానం

*మోదీ గుజరాత్లోని వాద్నగర్లో 1950లో జన్మించారు.
*8 ఏళ్ల వయసులో RSSలో చేరి.. 15 ఏళ్లు వివిధ బాధ్యతలు చేపట్టారు.
*1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
*2001లో శంకర్సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు ముదరడంతో మోదీని CM పదవి వరించింది.
*పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.