News February 5, 2025

ఏలూరులో జాయింట్ కలెక్టర్ తనిఖీలు

image

ఏలూరు నగర సమీపంలోని వంగూరు సివిల్ సప్లైస్ బఫర్ గోదాము, ఏలూరు మండల స్థాయి గోదాములను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాము ఇన్‌ఛార్జితో కలిసి రికార్డులను పరిశీలించారు. పేదలకు సంబంధించిన సరుకులను సకాలంలో పంపిణీ చేసేలా చూడాలన్నారు.  అవకతవకలకు పాల్పడినా, అక్రమాలు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

రెండో టెస్టు.. దక్షిణాఫ్రికా ఆలౌట్

image

గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో ఎట్టకేలకు దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ముత్తుస్వామి (109) శతకం బాదారు. జాన్సెన్ (93) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. టీమ్ ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.

News November 23, 2025

అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR

image

AP: తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) అన్నారు. ప్రస్తుతానికి తాను రైతు మాత్రమేనని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదని పేర్కొన్నారు. అవసరం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదని సూచించారు.

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.