News February 2, 2025

ఏలూరులో రేపటి గ్రీవెన్స్ డే రద్దు

image

ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో జరగాల్సిన అన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమాలను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు ఎవరూ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఏలూరుకు రావద్దని కోరారు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

image

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్‌లో 10 మంది మిస్సింగ్!

image

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్‌కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.

News November 20, 2025

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.