News March 16, 2025
ఏలూరులో రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ఏలూరు జిల్లాలో శనివారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. సంబంధిత ఆన్షర్ షీట్లను సోమవారం నుంచి దిద్దనున్నారు. ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, లెక్కలు, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు ఎంపిక చేసిన అధ్యాపకులు ఉదయం 10 గంటలకు వాల్యుయేషన్ సెంటర్ వద్దకు రావాలని ఆయన ఆదేశించారు.
Similar News
News November 20, 2025
సంగారెడ్డి: మంత్రిని కలిసిన ల్యాబ్ టెక్నీషియన్లు

ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా నుంచి ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు మంత్రి దామోదర రాజనరసింహను గురువారం సంగారెడ్డిలో కలిశారు. మంత్రి వారిని అభినందించి, జిల్లా వైద్య సిబ్బంది బలోపేతం కోసం సర్కార్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంలో ఎంపికైన వారిలో శ్రీశరత్ కుమార్, రాజు, ఇతర సంగారెడ్డి జిల్లా ల్యాబ్ టెక్నిషియన్లు పాల్గొన్నారు.
News November 20, 2025
ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే తెల్లం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 20, 2025
నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


