News March 16, 2025

ఏలూరులో రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

image

ఏలూరు జిల్లాలో శనివారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. సంబంధిత ఆన్షర్ షీట్లను సోమవారం నుంచి దిద్దనున్నారు. ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్‌ కె.యోహాను తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, లెక్కలు, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు ఎంపిక చేసిన అధ్యాపకులు ఉదయం 10 గంటలకు వాల్యుయేషన్ సెంటర్ వద్దకు రావాలని ఆయన ఆదేశించారు.

Similar News

News November 22, 2025

బోయినిపల్లి: ‘బాల్యంలోనే TARGET ఫిక్స్ చేసుకోవాలి’

image

విద్యార్థులు బాల్యంలోనే లక్ష్యాన్ని ఎంచుకోని దాని సాధనకు కృషి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని KGBVని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. తాము కోరుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.

News November 22, 2025

చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GDనెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 22, 2025

మదనపల్లెను భయపెట్టిన 1876 కరవు

image

మదనపల్లెను 1876లో భయంకరమైన కరవు భయపెట్టింది. ఈ ఏరియా రెండేళ్ల పాటు అతలాకుతలమైంది. ఆ సమయంలో చుక్క వర్షం పడలేదు. ఆ సమయంలో ఇండియా మొత్తం ఐదున్నర మిలియన్ల మంది చనిపోయినట్లు బ్రిటీషర్ల అంచనా. మదనపల్లె ఎక్కువగా ప్రభావితమైంది. మదనపల్లెకు 2మైళ్ల దూరంలోని అంగళ్లు రోడ్డులో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో గంజి ఫ్రీగా ఇచ్చి పేదల ప్రాణాలు నిలిపారు.