News April 11, 2024
ఏలూరులో ‘లవ్ మౌళి’ మూవీ టీం సందడి

ఏలూరులోని SVC మహల్లో హీరో నవదీప్ సందడి చేశారు. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రచయిత అనంత శ్రీరామ్, చిత్ర నటీమణులు, తదితరులు ఉన్నారు.
Similar News
News March 20, 2025
పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.
News March 20, 2025
తాడేపల్లిగూడెం యువకుడిపై పోక్సో కేసు

తాడేపల్లిగూడేనికి చెందిన సత్య అనే యువకునిపై విశాఖలో పోక్సో కేసు నమోదైంది. విశాఖకు చెందిన 17 ఏళ్ల బాలిక డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. స్వీట్ షాపులో పనిచేస్తున్న సత్యతో పరిచయం ఏర్పడింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ విజయవాడలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు విశాఖ తీసుకోచ్చారు. సత్యపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 20, 2025
ప.గో : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 377 మంది దూరం

టెన్త్ విద్యార్థులకు బుధవారం ద్వితీయ భాష హిందీ పరీక్ష జరిగింది. పరీక్షకు 21999 మంది విద్యార్థులకు గాను 21622 మంది విద్యార్థులు హాజరు కాగా 377 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 98.29% శాతం హాజరయ్యారని డిఇఓ నారాయణ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 457 మంది విద్యార్థులకు గాను 370 విద్యార్థులు హాజరు కాగా 87 గైర్హాజరయ్యారన్నారు.