News July 4, 2024
ఏలూరులో ‘వందేభారత్’ హాల్ట్ ఇవ్వాలని ఎంపీ వినతి

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఛైర్మన్ & సీఈఓ జయ వర్మ సిన్హాను బుధవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కలిశారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్లో వందేభారత్ రైళ్లకు ఏలూరులో హాల్ట్ కోరుతూ వినతిపత్రం అందించారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ను పనులు వేగవంతం చేయాల్సిందిగా కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించిట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
ధాన్యం రక్షణకు బరకాలు వినియోగించుకోవాలి: జేసీ

సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలలో రైతులకు బరకాలు అందుబాటులో ఉన్నాయని జేసీ రాహుల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 11 వేల బరకాలు ఉన్నాయన్నారు. వీటిని రైతులు వినియోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కళ్లాల్లో ఉన్న రైతులు తమ ధాన్యం తడవకుండా వెంటనే బరకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.
News December 3, 2025
ధాన్యం రక్షణకు బరకాలు వినియోగించుకోవాలి: జేసీ

సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలలో రైతులకు బరకాలు అందుబాటులో ఉన్నాయని జేసీ రాహుల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 11 వేల బరకాలు ఉన్నాయన్నారు. వీటిని రైతులు వినియోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కళ్లాల్లో ఉన్న రైతులు తమ ధాన్యం తడవకుండా వెంటనే బరకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.
News December 2, 2025
ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా భీమవరం: కలెక్టర్ నాగరాణి

జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ అవరోధాలు, రోడ్డు ఆక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్ తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


