News August 21, 2024

ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్‌కు హాల్ట్

image

గత సంవత్సర కాలంగా ఏలూరు ప్రజలు ఎదురు చూస్తున్న వందే భారత్ ఎఎక్స్‌ప్రెస్‌కు బుధవారం హాల్ట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కృషి ఫలితంగా వందే భరత్ రైలును ఏలూరులో నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఈ మేరకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్తక వాణిజ్య వర్గాలతోపాటు ప్రజలందరిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.

Similar News

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి

image

బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.

News September 29, 2024

జగన్‌కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ

image

ఏపీ మాజీ సీఎం జగన్‌కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.