News December 2, 2024

ఏలూరులో వివాహిత ఆత్మహత్య.. భర్తతో గొడవలే కారణం?

image

ఏలూరులో వివాహిత ప్రియాంక(25) <<14761231>>ఆత్మహత్యకు<<>> భర్తతో గొడవలే కారణమని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పని చేసే శ్రీకాంత్(30) అనే వ్యక్తి తనకు గతంలో పెళ్లయిందనే విషయాన్ని దాచి ప్రియాంకను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల ప్రియాంకకు తెలిసి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సైతం తెలిపింది. శనివారం రాత్రి కూడా గొడవ జరగ్గా నిన్న ఆమె ఉరి వేసుకుంది.

Similar News

News October 15, 2025

గుంతకల్లులో గంజాయి తరలిస్తూ పాలకొల్లు వాసి అరెస్ట్

image

అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ సర్కిల్ వద్ద మంగళవారం ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ ప.గో జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామ వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

News October 15, 2025

తణుకు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకులు మృతి

image

పాలకొల్లు మండలం దిగమర్రు రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకునకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. తణుకునకు చెందిన కొల్లి మహేశ్ రాజు (18), రాజులపాటి సాయి గణేష్(19), కూచి శరవణశర్మ బుల్లెట్ పై పేరుపాలెం బీచ్‌కు బయలుదేరారు. దిగమర్రు- పాలకొల్లు రోడ్డులో వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేశ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా గణేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News October 15, 2025

రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలే లక్ష్యం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎంవీబీఆర్‌వై పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌ఘర్ యోజన పథకాన్ని భారత ప్రధాని 1ఆగస్టు2025న ప్రారంభించారన్నారు. రెండు సంవత్సరాలలో యువతకు 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు.