News February 12, 2025
ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 23, 2025
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 88 పోస్టులు

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 88 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, B.LSc అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫారం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://dtu.ac.in/
News October 23, 2025
సోదరులు.. ఈ బాధ్యతను మరవొద్దు!

‘భాయ్ దూజ్’ రోజున తమ సోదరి ఆహ్వానాన్ని గౌరవించి సోదరులు ఆమె ఇంటికి సంతోషంగా వెళ్లాలి. ఆమెకు ప్రీతిపాత్రమైన కానుకలు, వస్త్రాలు తీసుకెళ్లాలి. ఇది సోదరి పట్ల ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. సోదరి పెట్టే తిలకం, హారతిని భక్తితో స్వీకరించాలి. భోజనం చేసిన తర్వాత, ఆమె పాదాలకు నమస్కరించి, వారి దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలి. ఎప్పుడూ వారికి తోడుగా ఉంటానని, కష్టాల్లో రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి.
News October 23, 2025
భద్రాచలం: నేటి నుంచే పాపికొండల యాత్ర ప్రారంభం

తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు పాపికొండల విహార యాత్ర గురువారం(నేటి) నుంచి ప్రారంభం కానుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి బోట్లు నడుపుటకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. పోచవరం, పేరంటాలపల్లి మీదుగా పాపికొండల యాత్ర కొనసాగుతుందని చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇన్చార్జ్ శుభం నోఖ్వాల్ తెలిపారు.