News March 19, 2025
ఏలూరులో 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు

ప్రధాన మంత్రి సూర్యఘర్ బిజిలీయోజన కింద అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిస్ధాయిలో అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇంతవరకు 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు మంజూరు చేశారని, మరో 305 పరిశీలనలో ఉన్నాయన్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన 415 దరఖాస్తులను పునఃపరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
VKB: ‘డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’

యువత డ్రగ్స్ మహమ్మారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణ కుమారి తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థి దశలో డ్రగ్స్కు అలవాటు పడితే పూర్తిగా జీవితం చిన్న భిన్నం అవుతుందని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు.
News November 18, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్లైన్లో <


