News March 19, 2025
ఏలూరులో 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు

ప్రధాన మంత్రి సూర్యఘర్ బిజిలీయోజన కింద అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిస్ధాయిలో అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇంతవరకు 715 మందికి రూప్ టాప్ సోలార్ యూనిట్లు మంజూరు చేశారని, మరో 305 పరిశీలనలో ఉన్నాయన్నారు. వివిధ కారణాలతో తిరస్కరించిన 415 దరఖాస్తులను పునఃపరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 23, 2025
‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.
News April 23, 2025
పాకిస్థాన్కు భారత్ బిగ్ షాక్

పాక్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన నేపథ్యంలో పాక్లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. సింధుకు ఉప నదులైన చీనాబ్, జీలం భారత్లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు..IND నుంచి పాక్లోకి ప్రవహిస్తుంది.
News April 23, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ఆదోని మార్కెట్లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు ☞ గాజులపల్లె వద్ద రైలు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు ☞ టెన్త్ ఫలితాల్లో నంద్యాల జిల్లాకు 17వ స్థానం ☞ అధికారులపై పాణ్యం MLA ఆగ్రహం ☞ పాణ్యంలో అత్యధికంగా 44⁰C ☞ పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేయండి: జేసీ ☞నంద్యాలలోని ఓ ఇంట్లో 12 అడుగుల కొండచిలువ ☞ పహల్గామ్ ఘటనపై మంత్రి బీసీ, ఎంపీ శబరి విచారం ☞ ఆర్యవైశ్యుల అభివృద్ధికి TDP అండ: మంత్రి ఫరూక్