News December 17, 2024
ఏలూరు: అనాథలైన ఆడబిడ్డలకు తండ్రిగా సీఐ కోటేశ్వరరావు బాధ్యత

ఏలూరు త్రీ టౌన్ పరిధిలో డిసెంబర్ 14న ఓ ఉన్మాది చేతిలో హత్యకు గురైన వెంకటరాజు సంతానమైన ముగ్గురు ఆడబిడ్డలకు సీఐ కోటేశ్వరరావు మరో తండ్రిగా నిలిచారు. అనాథలైన ఈ ముగ్గురి ఆడపిల్లలకు చదువు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తన వ్యక్తిగత సహాయ సహకారాలు ఉంటాయన్నారు. బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బాలికలకు సూచించారు.
Similar News
News November 17, 2025
భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.
News November 17, 2025
భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.
News November 17, 2025
నిమోనియాపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సీహెచ్ఓలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.


