News December 17, 2024

ఏలూరు: అనాథలైన ఆడబిడ్డలకు తండ్రిగా సీఐ కోటేశ్వరరావు బాధ్యత

image

ఏలూరు త్రీ టౌన్ పరిధిలో డిసెంబర్ 14న ఓ ఉన్మాది చేతిలో హత్యకు గురైన వెంకటరాజు సంతానమైన ముగ్గురు ఆడబిడ్డలకు సీఐ కోటేశ్వరరావు మరో తండ్రిగా నిలిచారు. అనాథలైన ఈ ముగ్గురి ఆడపిల్లలకు చదువు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తన వ్యక్తిగత సహాయ సహకారాలు ఉంటాయన్నారు. బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బాలికలకు సూచించారు.

Similar News

News January 18, 2025

నరసాపురం టూ చర్లపల్లికి ఖాళీగా వెళ్లిన రైలు

image

సంక్రాంతి ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందని శుక్రవారం నరసాపురం- చర్లపల్లికి ఏర్పాటు చేసిన రైలు కాళీగా దర్శనమిచ్చింది.దీంతో ఈనెల 19 నరసాపురం నుంచి చర్లపల్లికి మరో రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఈ రైలు నరసాపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి వెళ్తుందన్నారు. పాలకొల్లు, భీమవరం టౌన్, జంక్షన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా వెళ్తుంది.

News January 18, 2025

అభివృద్ధిపై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటలు విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష్యాల అమలు, ప్రగతిపై నిర్ధేశించిన కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.

News January 17, 2025

ఏలూరులో ఈనెల 22 జాబ్ మేళా

image

ఈనెల 22న ఏలూరులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధు భూషణరావు శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. తిరుపతిలో ఉన్న పశ్చిమ ఆసియా‌లో అతి పెద్ద క్యాడ్బరీ చాక్‌లెట్ తయారీ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.