News March 2, 2025
ఏలూరు: అపరాధ రుసుంలతో రూ.1.05 కోట్లు

ఏలూరు జిల్లాలోని ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులపై నమోదైన 3091 కేసుల ద్వారా రూ. 1.05 కోట్ల అపరాధ రుసుం వచ్చినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో హెల్మెట్ లేనివి 905, ట్రిపుల్ డ్రైవింగ్ 31, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 356, భీమా లేవిని291, ఫిట్నెస్ లేనివి143, టాక్స్ చెల్లించని వాహనాలపై 132 కేసులు ఉన్నాయన్నారు.1202 ఇతర కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News March 23, 2025
విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

AP: విశాఖ మేయర్పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు)కి చేరింది.
News March 23, 2025
విశాఖలో IPL మ్యాచ్కు స్పెషల్ బస్సులు

విశాఖలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు గాజువాక, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News March 23, 2025
27న పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.