News February 1, 2025
ఏలూరు: ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు: ఆర్ఐవో

ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 1, 3న ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని RIO చంద్రశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఫిబ్రవరి 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 18,453 విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే (137) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్ పాస్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు.
Similar News
News December 30, 2025
కొండగట్టులో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ దంపతులు మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 30, 2025
పసిడి సామ్రాజ్యం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్స్!

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఒక గొప్ప సెంటిమెంట్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న 34,600 టన్నుల బంగారం విలువ $5 ట్రిలియన్లకు (₹420 లక్షల కోట్లు) చేరిందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విశేషమేమిటంటే ఈ సంపద మన దేశ మొత్తం GDP ($4.1 ట్రిలియన్లు) కంటే కూడా ఎక్కువ. ఈ భారీ ‘గోల్డ్ పవర్’ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే హాట్ టాపిక్గా మారింది.


