News February 1, 2025
ఏలూరు: ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు: ఆర్ఐవో

ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 1, 3న ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని RIO చంద్రశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఫిబ్రవరి 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 18,453 విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే (137) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్ పాస్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు.
Similar News
News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News February 18, 2025
నిర్మల్: పీఎం శ్రీ బడులకు నిధులు మంజూరు

పీఎం శ్రీ ద్వారా కేటాయించిన నిధులను విద్యాసంస్థల్లో మౌలిక వసతులను సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పీఎం శ్రీ నిధుల వినియోగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలలకు కేటాయించిన పీఎంశ్రీ నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
News February 18, 2025
ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

1745: బ్యాటరీ ఆవిష్కర్త ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం