News March 11, 2025
ఏలూరు: ఇంటర్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. జిల్లాలో మొత్తం 19,237 మంది విద్యార్థులు ఉండగా 18,050 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 778 ఒకేషనల్ విద్యార్థులు 409 మంది గైర్హాజరు అయినట్టు యోహాను తెలిపారు.
Similar News
News November 16, 2025
సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.
News November 16, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరిపోయారు!

సైబరాబాద్ CP అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వీకెండ్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 468 కేసులు నమోదు చేశారు. 335 బైక్లు, 25 త్రీ వీలర్స్, 107 ఫోర్ వీలర్స్, ఒక హెవీ వెహికల్పైన కేసు నమోదు చేశామన్నారు. 51-100 BAC కౌంట్లో అత్యధికంగా 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు.
News November 16, 2025
నంద్యాల: మొక్కజొన్న రైతు కుదేలు

నంద్యాల జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎకరాకు రూ.25వేలు పెట్టుబడి పెట్టామన్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాలే వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.1800లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.


