News March 11, 2025
ఏలూరు: ఇంటర్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ పరీక్షకు 1187 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. జిల్లాలో మొత్తం 19,237 మంది విద్యార్థులు ఉండగా 18,050 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 778 ఒకేషనల్ విద్యార్థులు 409 మంది గైర్హాజరు అయినట్టు యోహాను తెలిపారు.
Similar News
News April 18, 2026
‘అరైవ్ అలైవ్’ ప్రచారం కాదు.. ప్రాణాల రక్షణకు వాగ్దానం: సీపీ

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గజ్వేల్లో ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందన్నారు.
News April 18, 2026
‘అరైవ్ అలైవ్’ ప్రచారం కాదు.. ప్రాణాల రక్షణకు వాగ్దానం: సీపీ

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గజ్వేల్లో ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందన్నారు.
News April 18, 2026
డీఎస్బీసీయూ కమిటీ ఛైర్మన్గా మణికంఠ

ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదారుల యూనియన్ డీఎస్బీసీయూ త్రీమెన్ కమిటీ ఛైర్మన్గా కారంచేడు మండలానికి చెందిన కడియం మణికంఠ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. త్రీ మెన్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన కడియం మణికంఠకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెల పెంపకదారుల అభ్యున్నతి కృషి చేయాలని ఆకాంక్షించారు.


