News April 8, 2025
ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.
Similar News
News September 16, 2025
విజయవాడ: వర్షాలకు పంట నష్టం.. ఎస్టిమేషన్స్ రెడీ!

జిల్లాలో గత నెల రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 1136.98 హెక్టార్లతో పంట నష్టం వాటిల్లింది. ఇందులో మినుము, పెసర, వరి, పత్తి పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్పుట్ రాయితీ రూ.27లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ వివరాలు పంపారు. త్వరలో ఇన్పుట్ సబ్సిడీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 16, 2025
శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాలు

AP: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. OCT 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నది హారతి, NOV 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శని, అది, సోమ, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు.
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.