News April 8, 2025
ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.
Similar News
News October 20, 2025
స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు

కోన ప్రభాకరరావు 1916, జులై 10న బాపట్లలో జన్మించారు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసి మద్రాసులో పట్టభద్రుడయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు.1967, 1972, 1978 శాసనసభకు ఎన్నికయ్యారు.1980-81 వరకు శాసనసభ సభాపతిగా పనిచేశారు.1983 సెప్టెంబరు 2న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యారు.
అక్టోబరు 20 1990న హైదరాబాదులో మరణించారు.
News October 20, 2025
నేడు పీజీఆర్ఎస్ రద్దు: సత్యసాయి జిల్లా ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా నేడు నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు కావడంతో జిల్లా పోలీసు ఆఫీస్లో కార్యక్రమం నిర్వహించలేదన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తిరిగి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటనలో వెల్లడిస్తామని చెప్పారు.
News October 20, 2025
నల్గొండ: రేకుల షెడ్లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.