News April 8, 2025
ఏలూరు: ఇద్దరు దొంగలు అరెస్ట్

ఏలూరు 3వ పట్టణం పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన గాల్సిద్ (29), రాజశేఖర్ (27) మిత్రులన్నారు. చెడు అలవాట్లకు బానిసై పార్క్ చేసిన స్కూటీ డిక్కీ లోని నగదును కాజేసేవారని, ఇదే స్టైల్లో ఏలూరులో రెండు దొంగతనాలు జరగగా అరెస్టు చేసి రూ.5 లక్షలు రికవరీ చేశామన్నారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
గోదూరులో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

JGTL(D)లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గోవిందారంలో అత్యల్పంగా 14.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలాపూర్లో 15.2, గుల్లకోట 15.3, మల్లాపూర్ 15.4, కథలాపూర్ 15.6, వెల్గటూర్, మల్యాల 15.7, మన్నెగూడెం, ఎండపల్లి 15.8, రాఘవపేట, ఐలాపూర్ 15.9, పెగడపల్లి 16, సారంగాపూర్, మేడిపల్లి, రాయికల్, నెరెళ్ల, కోల్వాయి, పొలాస 16.1, పూడూర్ 16.2, బుద్దేశ్పల్లి, జగ్గాసాగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3C°గా నమోదైంది.
News November 23, 2025
SRD: డీసీసీ పదవి.. ముగ్గురు మొనగాళ్లు!

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను శనివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట జిల్లాలను సైతం ఈ జాబితాలో చేర్చారు. సంగారెడ్డి DCC అధ్యక్ష పదవిని పెండింగ్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఆశావహుల కోసం ముగ్గురు కీలక నేతలు పావులు కదపడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తర్జనభర్జన పడి చివరకు SRDని పక్కన పెట్టారు.


