News August 27, 2024

ఏలూరు: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

image

ఏలూరు నగరంలోని స్థానిక సుంకర వారి తోటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో చంటి అనే వ్యక్తిపై ఏసు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చంటికి గాయాలు కాగా వెంటనే అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 24, 2025

ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News December 24, 2025

ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News December 23, 2025

ఏలూరు జిల్లాలో 92.93 శాతం మందికి పోలియో చుక్కలు

image

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాబాయి తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్‌లలోనూ, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1,87,204 మంది చిన్నారులకు గాను, 1,73,975 (92.93%) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.