News January 30, 2025

ఏలూరు: ఎన్నికల కోడ్ కూసింది..  

image

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గురువారం అమలులోకి వచ్చింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఫ్లేక్సీలు తొలగించి, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్నారు. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం తదితర గ్రామాలలో రాజకీయ నాయకుల ఫ్లేక్సీల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రోడ్లపై గుంపులుగా తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 27, 2025

ములుగు: పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లు పంపిణీ

image

ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్లు, టీ షర్ట్‌లను పంపిణీ చేశామని, పోలీసులు కాలం, సమయంతో సంబంధం లేకుండా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, అలాంటి వారికి కాలానుగుణంగా ఇవి తోడ్పడతాయన్నారు.

News November 27, 2025

బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.

News November 27, 2025

RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్‌లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్‌లలోని నిర్వాహకులు చెబుతున్నారు.