News January 31, 2025

ఏలూరు: ఎన్నికల నియమావళి పాటించాలి- కలెక్టర్

image

తూ.గో, పా.గో, ఏలూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాధనలను ఈ నెల 31న సమర్పించాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.

Similar News

News November 24, 2025

బాపట్ల: మాంసం దుకాణాల్లో మోసాలు..!

image

బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడులోని మాంసం దుకాణాలను తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో కాటాలకు సరైన ముద్రలు లేనట్లు గుర్తించారు. వారికి రూ.9 వేలు ఫైన్ వేశారు. కొలతల్లో లోపాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు కచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందజేయాలని ఆదేశించారు. మీ దగ్గర తూకాల్లో మోసం జరుగుతుందా? కామెంట్ చేయండి.

News November 24, 2025

ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

image

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

ఖమ్మం: రిజర్వేషన్లు ఖరారు.. కలెక్టర్ గెజిట్ విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, 5214 వార్డుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లలో 260 మహిళలకు.. 311 జనరల్ స్థానాలను కేటాయించారు. అలాగే 5,214 వార్డుల్లో 2,252 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల నివేదికను నేడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.