News January 31, 2025
ఏలూరు: ఎన్నికల నియమావళి పాటించాలి- కలెక్టర్

తూ.గో, పా.గో, ఏలూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాధనలను ఈ నెల 31న సమర్పించాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News December 18, 2025
ఆహారాన్ని పాలుగా మార్చే శక్తి ఎక్కువ

ముర్రా జాతి గేదెలకు ఉండే మరో ప్రత్యేకత అధిక పాల సామర్థ్యం. ఇవి ఎంత ఎక్కువ మేత తింటే ఆ ఆహారాన్ని అంత ఎక్కువగా పాలుగా మార్చుకుంటాయి. ఈ సామర్థ్యం మిగతా జాతి గేదెల కంటే ముర్రాజాతి గేదెలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతర జాతి గేదెల్లా కాకుండా తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ పాల ఉత్పత్తిని పొందవచ్చు. వీటిలో మగ గేదెలు 550-750 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆడ గేదెలు 450-500 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
News December 18, 2025
గజ్వేల్: ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోని కాంగ్రెస్

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్లో అధికార కాంగ్రెస్ ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోలేకపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపల్ కాగా, వర్గల్లో బీఆర్ఎస్, ములుగు- బీఆర్ఎస్, మర్కూక్- బీఆర్ఎస్, జగదేవపూర్- బీఆర్ఎస్, కుకునూరుపల్లి- బీఆర్ఎస్ దక్కించుకోగా, కొండపాక బీజేపీ ఖాతాలో పోయింది. దీంతో అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలే మిగిలాయి.
News December 18, 2025
ఆదిపూడిలో వివాహిత సూసైడ్

కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలో బుధవారం ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారంతో కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాషా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు చీరాల ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదైంది.


