News September 22, 2024

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు

image

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నవీకరణ, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 24 నుంచి వచ్చేనెల 15 వరకు గడువు ఉందన్నారు.

Similar News

News October 24, 2025

డీఎస్పీకి RRR కితాబివ్వడం సరికాదు: కొత్తపల్లి

image

డిప్యూటీ స్పీకర్ రఘురామ భీమవరం డీఎస్పీకి కితాబులిస్తూ మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ‘ప.గో జిల్లాలో పేకాట సహజమంటూ RRR చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమన్నారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమనలేదు. దీనిపై పవన్‌తో RRR నేరుగా మాట్లాడాల్సింది’ అని అన్నారు.

News October 24, 2025

కలెక్టరేట్‌లో కంట్రోలు రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. శుక్రవారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో 88162 99219 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

News October 23, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి
గురువారం అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299219 ఏర్పాటు చేశామన్నారు.