News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రి సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11 పరిశీలన, ఫిబ్రవరి 13 ఉపసంహరణ, ఫిబ్రవరి 27 పోలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News November 27, 2025
ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్మెంట్ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.
News November 27, 2025
VKB: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని వైద్యాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి పర్యవేక్షక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.


