News February 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు

image

ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు.  20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్‌లు అందాయన్నారు.

Similar News

News November 23, 2025

NGKL: వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

image

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇల్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మడం మంచిది కాదని ఆమెతో మంత్రి పూజ చేయించారు.

News November 23, 2025

అనకాపల్లి: ఈనెల 24 నుంచి రైతు వారోత్సవాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి 29 వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు
అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి ఆదివారం తెలిపారు. దీని ద్వారా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రతి 3 రైతు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రోజుకి 30 క్లస్టర్ల (90 కుటుంబాలు)కు చెందిన రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

News November 23, 2025

స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్!

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్‌లో సాంగ్లీలోని సర్వ్‌హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.