News February 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు

image

ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు.  20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్‌లు అందాయన్నారు.

Similar News

News October 28, 2025

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CBN భేటీ

image

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో CM CBN సమీక్ష చేపట్టారు. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. పునర్విభజనలో ప్రస్తుత కొన్ని జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్పు చేయనున్నారు. నేతలు, సంఘాల వినతి మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. Dy CM పవన్ కళ్యాణ్, మంత్రులు భేటీలో పాల్గొన్నారు.

News October 28, 2025

మునగ సాగు.. ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 28, 2025

ఎర్రమరెడ్డిపాలెం చెరువును పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సిబ్బందితో డిస్ట్రిక్ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్ బాబు, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సమావేశమయ్యారు. అనంతరం రేణిగుంట సమీపంలోని ఎర్రమ రెడ్డి పాళెం చెరువును పరిశీలించారు. మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.