News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు

ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు. 20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్లు అందాయన్నారు.
Similar News
News December 4, 2025
HYD: 2047 అంచనాలతో సీవరేజ్ డిజైన్!

ORR వరకు ఉన్న ప్రాంతాలు సైతం జలమండలిలోకి రావటంతో విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ నెట్వర్క్ అంతగా లేదు. దీనిని గుర్తించిన జలమండలి 2047 వరకు నగరంలో పెరిగే జనాభా ప్రాతిపదికన డీటెయిల్డ్ డ్రైనేజీ సిస్టం ప్లానింగ్ రూపొందిస్తున్నట్లుగా తెలిపింది. ఈ సిస్టం పూర్తి చేయడానికి రూ. వేలాది కోట్లు ఖర్చుకానున్నాయి.
News December 4, 2025
S-500 గురించి తెలుసా?

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.
News December 4, 2025
కామారెడ్డి: 3వ విడత తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, డోంగ్లి, మద్నూర్, జుక్కల్, నస్రుల్లాబాద్, బీర్కూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల్లో 3వ విడత ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు దాఖలైన నామినేషన్లను అధికారులు వెల్లడించారు.168 సర్పంచ్ స్థానాలకు 128 నామినేషన్లు రాగా, 1,482 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేపటి వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.


