News February 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు

image

ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు.  20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్‌లు అందాయన్నారు.

Similar News

News March 16, 2026

LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌లు: CBN

image

AP: గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని CBN కంపెనీల అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, గుడులకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ప్రజల్లో ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వినియోగించేలా చేయాలన్నారు. LPG వాడకం తగ్గించేలా హోటళ్లతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో 17,209MT స్టాక్ ఉందని CMకు అధికారులు తెలిపారు.

News March 16, 2026

కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. 77 మందికి జరిమానాలు

image

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 77 మందికి కోర్టు శిక్షలు విధించింది. వారిలో ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష విధించగా మొత్తం ₹95,500 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. క్షణికానందం కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దన్నారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు.

News March 16, 2026

GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

image

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.