News October 14, 2024

ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News January 7, 2026

జిల్లాలో 46 రైల్వే వంతెనలకు లైన్ క్లియర్: జేసీ రాహుల్

image

జిల్లాలో ప్రతిపాదించిన 50 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల పనుల్లో పురోగతి లభించింది. ఇందులో 46 నిర్మాణాలకు మంజూరు లభించినట్లు జేసీ రాహుల్ వెల్లడించారు. బుధవారం భీమవరంలో తన ఛాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైల్వే సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల పరిధిలో త్వరితగతిన కొలతలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News January 7, 2026

శాఖాపరమైన పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు: డీఆర్ఓ

image

భీమవరం డీఎన్ఆర్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఈనెల 8న జరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలన్నారు.

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.