News March 7, 2025

ఏలూరు: ఓ మంచి ఆలోచన..!

image

పక్షుల దాహార్తిని తీర్చడానికి పలువురు వివిధ రకాల పద్ధతులను ఆచరిస్తున్నారు. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బండివారి గూడెంలో వనసంరక్షణ సమితి సభ్యుడు, ఏలూరు జిల్లా రానా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ జాకీర్ హుస్సేన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. నిరుపయోగంగా ఉండే పాత్రలను సేకరించి పక్షులు తిరిగే ప్రదేశాల్లో చెట్లకు వేలాడదీసి నీరు పోశారు. మీరూ ఇలా ట్రై చేయండి.

Similar News

News October 31, 2025

KNR: ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలి: కవిత

image

మొంథా ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల పరిహారం చెల్లించాలని జాగృతి అధ్యక్షరాలు కవిత డిమాండ్ చేశారు. KNR(D) తిమ్మాపూర్(M) నల్లగొండలో ఆమె IKP కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తడిసినా, మొలకెత్తినా, బూజు పట్టినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించడం లేదన్నారు.

News October 31, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

image

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.

News October 31, 2025

జెమీమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అద్భుత బ్యాటింగ్ జెమీమా రోడ్రిగ్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ముంబైలో 2000లో జన్మించిన జెమీమా చిన్నవయసులోనే బ్యాట్ చేతబట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ చివరికి క్రికెట్‌నే ఎంచుకొంది. 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది.