News October 21, 2024

ఏలూరు: కరెంట్ షాక్ తగిలి యువకుడి మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం విషాద ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడేనికి చెందిన కవులూరి చరణ్(20) గురవాయిగూడెంలో కర్ర కోత మిషన్ పనికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ షాక్ తగిలి మృతిచెందాడు. కోత మిషన్ యజమాని మేకల గంగాధర్ తిలక్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

ఆకివీడు: ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

image

ఆకివీడులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.

News November 18, 2025

ఆకివీడు: ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

image

ఆకివీడులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.

News November 18, 2025

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్ నాగరాణి

image

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు అభ్యర్థులు https:/apstudycircle.apcfss.in వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.