News April 13, 2025
ఏలూరు: కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ధర్నా

తన కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ముసునూరులోని అక్కిరెడ్డిగూడెనికి చెందిన ఉమా శిరీష, నవీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారంలో చెలరేగిన వివాదంలో శిరీష పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడిని అరెస్ట్ చేయాలని తండ్రి నాగరాజు పురుగుమందు డబ్బాతో ధర్నా చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 8, 2025
యువతకు భద్రత కల్పించండి: SP

యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని SP ధీరజ్ కునుబిల్లి శనివారం జిల్లా పోలీసులను ఆదేశించారు. ‘శక్తి’ టీమ్ బృందాలు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల నివారణపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వలన ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.
News November 8, 2025
బండి సంజయ్ హాట్ కామెంట్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
News November 8, 2025
నాగిరెడ్డిపేట: పురుగుల మందు సేవించి వృద్ధురాలి మృతి

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన రోడ్డ రత్నవ్వ (70) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది రత్నవ్వ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుమార్తె రోడ్డ సాయవ్వ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


