News February 25, 2025
ఏలూరు: కూటమి అభ్యర్థితో వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

ఏలూరు జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా సోమవారం తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
Similar News
News November 26, 2025
కంది: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. 100% ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేక అధికారి ఉన్నారు.
News November 26, 2025
ఏలూరు: మంత్రి నాదెండ్లకు ZP ఛైర్పర్సన్ రిక్వెస్ట్

ఏలూరు రెవెన్యూ అతిథి భవనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ను బుధవారం జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ కలిశారు. ఇటీవలి భారీ వర్షాలు, తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని ఆమె వివరించారు. అత్యవసర మరమ్మతు పనుల కోసం, ముఖ్యంగా పంచాయతీరాజ్ రహదారుల పునరుద్ధరణకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
News November 26, 2025
సంగారెడ్డి: ప్రజలకు న్యాయ సహాయం అందిస్తున్నాం: జిల్లా జడ్జీ

ప్రజలకు వివిధ సంస్థల ద్వారా న్యాయ శాఖ అందిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయ దినోత్సవ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయలోక్ అదాలత్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.


