News March 3, 2025

ఏలూరు: కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

image

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడి కానుంది.

Similar News

News October 14, 2025

MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

image

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

News October 14, 2025

HNK: జాతీయ రికార్డులో స్వర్ణ పతకం సాధించిన గురుకుల విద్యార్థి

image

భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో HNK బాయ్స్ బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి కంచు లవ్లిత్ ట్రయథ్లాన్ విభాగంలో 2510 పాయింట్లతో జాతీయ రికార్డు బద్దలు కొట్టి స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు లవ్లిత్‌ను అభినందించారు.

News October 14, 2025

అక్టోబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1956: బౌద్ధమతం స్వీకరించిన BR అంబేడ్కర్(ఫొటోలో)
1980: సినీ నటుడు శివ బాలాజీ జననం
1981: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జననం
1982: కవి సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి మరణం
1994: బొగద సొరంగం పనుల ప్రారంభం
1998: అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి
2010: సినీ రచయిత సాయి శ్రీహర్ష మరణం
2011: తెలుగు రచయిత జాలాది రాజారావు మరణం
*వరల్డ్ స్టాండర్డ్స్ డే