News April 16, 2025

ఏలూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి 

image

గుర్తు తెలియని మృతదేహం అస్థి పంజరg స్థితిలో లభ్యమైన ఘటన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తూరు ఇందిరా కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాలలో బుధవారం సాయంత్రం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెంది సుమారు నెలకు పైగా కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 29, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తుఫాన్ సహాయక చర్యలు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరగాయి. చెట్లు విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాలపై పడిన చెట్లను తొలగించి విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు అల్పాహార పంపిణీని అధికారులు పర్యవేక్షించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

News October 29, 2025

SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్‌(SECL)లో<> 595 <<>>పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మైనింగ్ సిర్దార్, జూనియర్ ఓవర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా , మైనింగ్ సిర్దార్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పాటు పని అనుభవం గల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://secl-cil.in

News October 29, 2025

ఖమ్మం: MPని లైట్ తీసుకుంటున్నారా..!

image

ఖమ్మంలో ముగ్గురు మంత్రుల మధ్య MP రఘరాంరెడ్డి ప్రభావం చూపలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. మంగళవారం జరిగిన దిశ సమీక్ష సమావేశామే ఇందుకు ఉదాహరణగా ఉటంకిస్తున్నారు. మీటింగ్‌కు MLAలు, జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. వైరా, సత్తుపల్లి MLAలు తమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ MP సమీక్షకు హాజరుకాలేదని సమాచారం. మంత్రులను మచ్చిక చేసుకోవడంలో అధికారులు క్యూ కడుతున్నారే తప్పా ఎంపీని పట్టించుకోవడం లేదని టాక్.