News March 26, 2025

ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

image

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Similar News

News January 3, 2026

దేశంలోనే తొలి ఏఐ క్లినిక్

image

వైద్య రంగంలో మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ నోయిడాలోని(UP) గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో దేశంలోనే తొలి ప్రభుత్వ AI క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ వైద్యులకు సాయంగా నిలిచి చికిత్సను మరింత కచ్చితంగా మార్చనుంది. అదే విధంగా వ్యాధి లక్షణాలను వేగంగా గుర్తిస్తుంది. మెడికల్ రిపోర్టులను త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు సరైన చికిత్సను సూచించడం వంటివి చేస్తుంది.

News January 3, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి: ​కలెక్టర్

image

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ కనీసం 40 ఎంట్రీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 3, 2026

‘ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి’

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రవాణా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలను గుర్తించాలన్నారు. అక్కడ వెంటనే హెచ్చరిక బోర్డులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.