News March 26, 2025
ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News November 22, 2025
కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


