News February 24, 2025

ఏలూరు: గ్రూప్-2 పరీక్షకు 7,759 మంది హాజరు

image

ఏలూరులో నిన్న నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది హాజరుకాగా, 534 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్స్‌లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది అభ్యర్థులు హాజరుకాగా 537 మంది గైర్హాజరయ్యారు.

Similar News

News December 8, 2025

పాలమూరు: వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ పదవికి పోటీ

image

కొత్తకోట మండలం రామనంతపూర్‌లో మొత్తం 8 వార్డులున్నాయి. రెండో విడత నామినేషన్‌లో భాగంగా సర్పంచ్ పదవికి ఆరుగురు, వార్డు మెంబర్లకు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా చేసి, నిధులతో దేవాలయం నిర్మించాలని తీర్మానించగా, నలుగురు అభ్యర్థులు తప్పుకున్నారు. కానీ యాదగిరిరెడ్డి, శివుడు పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ఏకగ్రీవ చర్చలు విఫలమయ్యాయి. వార్డు మెంబర్‌లను మాత్రం ఏకగ్రీవం వరించింది.

News December 8, 2025

హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

image

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.

News December 8, 2025

పల్నాడు: కమ్మేసిన పొగ మంచు

image

పల్నాడు ప్రాంతాన్ని మంచు దుప్పటి దట్టంగా కమ్మేయడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు కూడా సరిగా కనపడటం లేదు. దట్టమైన మంచు తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల చిలకలూరిపేట వద్ద మంచు కారణంగా వాహనం కనిపించక జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.