News February 24, 2025
ఏలూరు: గ్రూప్-2 పరీక్షకు 7,759 మంది హాజరు

ఏలూరులో నిన్న నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది హాజరుకాగా, 534 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్స్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది అభ్యర్థులు హాజరుకాగా 537 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు పూర్తి అవగాహన కల్పించుకొని ఎన్నికల విధులను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలపై అధికారులకు రెండవ విడత శిక్షణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్, మార్గదర్శకాలు సూచనలు తప్పక పాటించాలన్నారు.
News February 24, 2025
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు: రేవంత్

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్హౌస్లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 24, 2025
SSS: కలెక్టర్ కార్యాలయానికి 233 అర్జీలు

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 233 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుంచి సమస్యలపై కలెక్టర్కు ప్రజలు అర్జీలు ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సమగ్ర విచారణ జరిపి సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.