News February 24, 2025
ఏలూరు: గ్రూప్-2 పరీక్షకు 7,759 మంది హాజరు

ఏలూరులో నిన్న నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది హాజరుకాగా, 534 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్స్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది అభ్యర్థులు హాజరుకాగా 537 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News December 5, 2025
పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.
News December 5, 2025
గూడూరు ప్రజల సెంటిమెంట్ పట్టించుకోరా..?

దుగ్గరాజపట్నం పోర్టు కోసమే గూడూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరులో గూడూరు విలీనం లేదా గూడూరు జిల్లా అనేది దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడి మాట తీరు, కల్చర్ అంతా నెల్లూరుకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు మాది నెల్లూరేనని కొత్తవాళ్లతో పరిచయం చేసుకుంటారు. ఇంతలా అక్కడి వాళ్లు నెల్లూరుతో బంధం పెంచుకున్నారు.
News December 5, 2025
ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.


