News February 24, 2025
ఏలూరు: గ్రూప్-2 పరీక్షకు 7,759 మంది హాజరు

ఏలూరులో నిన్న నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది హాజరుకాగా, 534 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్స్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది అభ్యర్థులు హాజరుకాగా 537 మంది గైర్హాజరయ్యారు.
Similar News
News March 18, 2025
సిద్దిపేట: ఆన్లైన్ బెట్టింగ్లతో ప్రాణాలపై తెచ్చుకోవద్దు: సీపీ

ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్లను ప్రమోట్ (ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలని, బెట్టింగ్లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు, ఇతర వివరాలు పంపొద్దన్నారు.
News March 18, 2025
మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.
News March 18, 2025
టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు.