News July 27, 2024

ఏలూరు:: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

తాడేపల్లిగూడెంలో కొట్టుకు చెక్..?

image

తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొట్టు సత్యనారాయణపై అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలు జగన్‌ను కలిశారని ప్రచారం సాగుతోంది. సర్పంచ్‌లు, ఎంపీపీలు పార్టీని వీడటంతో వడ్డీ రఘురామ్‌కు బాధ్యతలు అప్పగించాలని వారు కోరినట్లు సమాచారం. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు టాక్. త్వరలోనే వడ్డీ రఘురామ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గుసగుసలు.

News January 3, 2026

భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

image

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

News January 3, 2026

భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

image

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.