News March 8, 2025
ఏలూరు: చేపల చెరువులకు నీరు ఇవ్వాలని వినతి

వేసవి నేపథ్యంలో నీటి కొరత ఉందని.. చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ను ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. వినతిపత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు.
Similar News
News March 18, 2025
మందుబాబులకు గుడ్ న్యూస్!

TG: కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త బీర్లు అమ్మేందుకు TGBCLకు దాదాపు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుంది. అన్ని పూర్తయితే ఏప్రిల్ నుంచి అమ్మకాలు జరిపేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.
News March 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ల మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనిని ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
News March 18, 2025
మహేశ్ బాబు ఔదార్యం.. ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.