News April 12, 2025
ఏలూరు జిల్లాకు 9వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో ఏలూరు జిల్లా నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్లో 12,086 మంది పరీక్షలు రాయగా 10,376 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 15,288 మందికి 10,842 మంది పాసయ్యారు. 71 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో ఏలూరు జిల్లా నిలిచింది.
Similar News
News April 17, 2026
612 కేసులు నమోదు: చిత్తూరు SP

విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ హెచ్చరించారు. 2025 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 612 కేసులు నమోదు చేసి రూ. 69,500 జరిమానా విధించినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదన్నారు.
News April 17, 2026
గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగకూడదా?

గుడికి వెళ్లొచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా కడిగితే గుడిలో లభించిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయంటున్నారు. ‘ప్రదక్షిణల ద్వారా పాదాలు, పూజ ద్వారా శరీరం గ్రహించిన శక్తిని వెంటనే నీటితో కడిగేయకూడదు. కనీసం 15-20 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. అయితే ఏదైనా తినే ముందు లేదా అపరిశుభ్రంగా అనిపిస్తే చేతులు కడుక్కోవడంలో తప్పు లేదు.
News April 17, 2026
అప్రూవర్గా మారుతా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అప్రూవర్గా మారుతానని ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీనిపై EDకి రిక్వెస్ట్ పెట్టమని కోర్టు సూచించింది. కాగా నిందితుడు <<12328864>>సుకేశ్<<>> జాక్వెలిన్తో గతంలో రిలేషన్లో ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే. అధికారినని, బిలియనీర్ శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని ఆయన భార్య నుంచి సుకేశ్ ₹215Cr వసూలు చేయడంతో ఈ కేసు బయటపడింది.


