News February 26, 2026
ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లాలో 2,57,658 మంది లబ్ధిదారులకు రూ.113.09 కోట్లు అందజేస్తున్నామని, శనివారమే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
Similar News
News April 18, 2026
HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.
News April 18, 2026
HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.
News April 18, 2026
బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం ఎందుకు?: NDSA ఛైర్మన్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనుల్లో జరుగుతున్న జాప్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉన్న కొన్ని ఒప్పందపరమైన సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA ఛైర్మన్కు వివరించారు.


