News February 2, 2025
ఏలూరు జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. మొత్తం 32 వార్డులుండగా.. YCP 25, TDP 8 చోట్ల గెలిచింది. ఎలక్షన్ ముందు ఓ కౌన్సిలర్ TDP గూటికి చేరారు. తాజాగా మరికొందరు YCPని వీడుతారని తెలుస్తోంది. ఈక్రమంలో మాజీ MLA ప్రతాప అప్పారావు అప్రమత్తమై YCP కౌన్సిలర్లను క్యాంపునకు పంపినట్లు తెలుస్తోంది. వైస్ ఛైర్మన్ పదవి TDPకి దక్కేలా మంత్రి పార్థసారథి తన మార్క్ రాజకీయం చేస్తున్నారని నూజివీడులో టాక్.
Similar News
News November 23, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రీవెన్స్ డే

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం

డా. బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యయన కేంద్రంలో ఆదివారం డిగ్రీ 1, 3, 5 వ సెమిస్టర్, పి.జీ. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. అధ్యయన కేంద్రం వసతులు, నియమ నిబంధనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర – ఆర్డినేటర్ డా. కె. రంజిత, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
News November 23, 2025
ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేశ్వర్

తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్(టీఏసీసీయూ) రాష్ట్ర కార్యదర్శిగా మెదక్కు చెందిన కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రామణా రెడ్డి ఎన్నికయ్యారు.


