News March 21, 2025
ఏలూరు జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ఏలూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం అత్యధికంగా 40.72 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదయ్యాయి. ఇవాళ కూడా అన్ని మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News December 18, 2025
SRD: 21 ఏళ్లకే సర్పంచ్గా గెలుపు

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రోజా సమీప ప్రత్యర్థిపై 76 ఓట్లతో విజయం సాధించారు. 21 సంవత్సరాల రోజా ఇంటర్ దాకా చదివింది. రోజా విజయంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ రోజా తెలిపారు.
News December 18, 2025
టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.
News December 18, 2025
NZB: తుది దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది దశ పోరులో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో విడతలో మొత్తం 165 పంచాయతీ సర్పంచ్లకు 19 చోట్ల ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 95 చోట్ల, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల సర్పంచ్లుగా గెలుపొందారు.


