News April 2, 2025
ఏలూరు జిల్లాలో తొలిరోజు 93.22 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజైన మంగళవారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 93.22 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,60,195 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.113.14 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 2,42,548 మందికి (93.22 శాతం) రూ.105.25 కోట్లు అందజేశారు. ఇంకా కేవలం 19,068మందికి పింఛన్లు అందించాల్సి ఉందన్నారు.
Similar News
News November 26, 2025
సిద్దిపేటలో మహిళలకే 232 స్థానాలు

సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 508 జీపీలు ఉండగా అందులో మహిళలకే 232 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీ మహిళలకు 8, ఎస్సీలకు 41, బీసీలకు 61, జనరల్- మహిళలకు 122 స్థానాలు రిజర్వు చేశారు. అయితే 42 % ఆశించిన బీసీలకు 26.7 % మాత్రమే దక్కాయి. జిల్లాల మొత్తం ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో పురుషులు 3,21,766 మహిళలు 3,34,186, ఇతరులు 6 మంది ఉన్నారు.
News November 26, 2025
మార్కాపురం జిల్లా.. బలాలు మీకు తెలుసా..?

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడగా జిల్లా బలాలపై సరికొత్త చర్చ సాగుతోంది. జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తైతే జిల్లా మరింత సస్యశ్యామలం కానుంది. కొత్త జిల్లా ఏర్పడిన కొన్ని నెలల్లోనే వెలుగొండ జలాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండవ చెరువైన కంభం చెరువు, నల్లమల అందాలు కొత్త జిల్లాకు బలమే కాక, సరికొత్త అందాలుగా కూడా చెప్పవచ్చు.
News November 26, 2025
HNK: ఈసారి ఎలక్షన్స్లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

హన్మకొండ మండలంలో మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.


