News April 2, 2025
ఏలూరు జిల్లాలో తొలిరోజు 93.22 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తొలిరోజైన మంగళవారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 93.22 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,60,195 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.113.14 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 2,42,548 మందికి (93.22 శాతం) రూ.105.25 కోట్లు అందజేశారు. ఇంకా కేవలం 19,068మందికి పింఛన్లు అందించాల్సి ఉందన్నారు.
Similar News
News November 12, 2025
2026 వన మహోత్సవం లక్ష్యం 52 లక్షలు: కలెక్టర్

2026 సంవత్సరంలో వన మహోత్సవంలో భాగంగా ASF జిల్లా వ్యాప్తంగా 52 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే వెల్లడించారు. మంగళవారం ASF కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వన మహోత్సవంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు కార్యచరణ రూపొందించాలని, అవసరమైన మట్టి విత్తనాలు సేకరించాలని తెలిపారు.
News November 12, 2025
‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి’

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి గృహ నిర్మాణశాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలలో మొక్కల పెంపకం, ఈనెల 14న పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News November 12, 2025
ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్బంధన్(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?


