News March 12, 2025
ఏలూరు జిల్లాలో దాదాపు 49,436 మందికి లబ్ధి

స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే ధృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించిందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. జిల్లాలో దాదాపు 49,436 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని ఎస్సీలు, బీసీలకు ₹.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవిజిటీలకు రూ. లక్ష మంజూరు చేయడం జరిగిందన్నారు.
Similar News
News March 23, 2025
మక్తల్: బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశాలకు ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9వ తరగతుల్లో ఆంగ్ల మీడియంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈ బీసీలకు తెలంగాణ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మక్తల్ ఎంజేపీ ప్రధానాచార్యులు కే హెన్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి-నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఆమె ప్రతిభ చాటారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించడం విశేషం. ఆమె నెలకు రూ.6వేల డాలర్ల పారితోషకం అందుకోనున్నారు.
News March 23, 2025
మే 7న ఏపీ ఐసెట్

AP: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ₹1000, 15 నుంచి 19 వరకు ₹2వేలు, 20 నుంచి 24 వరకు ₹4వేలు, 25 నుంచి 28వ తేదీ వరకు ₹10వేల లేట్ ఫీజుతో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/