News March 16, 2025
ఏలూరు జిల్లాలో దారుణం

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు.
Similar News
News December 5, 2025
కరీంనగర్: ‘విదేశాల్లో విద్యపై అవగాహన తరగతులు’

విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవగాహన తరగతులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు డిసెంబర్ 21లోపు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. స్కాలర్షిప్లు, IELTS ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అవగాహన కార్యక్రమంపై పూర్తి సమాచారం కోసం 040-24071178 లేదా 0878-2268686 సంప్రదించవచ్చని డైరెక్టర్ ఎం.రవికుమార్ తెలిపారు.
News December 5, 2025
చిగ్గర్ మైట్ పురుగుతో స్క్రబ్ టైపస్ వ్యాధి: బాపట్ల DMHO

స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO విజయమ్మ చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్క్రబ్ టైపస్ కొత్త రకం కాదన్నారు. జ్వరం, తలనొప్పిని ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు వలన వ్యాధి వ్యాపిస్తుందన్నారు. పురుగు కుట్టినచోట నల్లగా మచ్చలు ఏర్పడతాయన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలన్నారు.
News December 5, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <


