News March 16, 2025

ఏలూరు జిల్లాలో దారుణం

image

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు. 

Similar News

News March 16, 2025

IMLT20: ఇండియా మాస్టర్స్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 ఫైనల్లో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. సిమ్మన్స్(57), డ్వేన్ స్మిత్(46) మినహా ఆ జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వినయ్ 3, నదీమ్ 2, బిన్నీ, పవన్ తలో వికెట్ తీశారు. ఇండియా మాస్టర్స్ టార్గెట్ 149.

News March 16, 2025

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి

image

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధిలోని షీ టాయిలెట్స్‌తో పాటు పబ్లిక్ టాయిలెట్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి పనితీరును ఎంహెచ్ఓ అడిగి తెలుసుకున్నారు. నగరానికి మారు ఓడిఎఫ్ ++ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ ఉండాలన్నారు. మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించాలని తెలిపారు.

News March 16, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున నిజాంసాగర్‌లోని హాసన్‌పల్లి, పాల్వంచలోని ఎల్పుగొండ, 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డోంగ్లి, జుక్కల్ 41.4, మద్నూర్‌లోని మేనూర్ 41.2, పిట్లం 41.1, మద్నూర్‌లోని సోమూరు, నాగిరెడ్డిపెట్, ఎల్లారెడ్డిలోని మచపూర్‌లో 40.9,బిచ్కుంద, దోమకొండ 40.7, కామారెడ్డిలోని కలక్టరేట్‌లో, గాంధారి, సర్వపూర్ 40.5°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!