News March 27, 2025
ఏలూరు జిల్లాలో నాటి ప్రధాన వార్తలు

* పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు* పలు మండలాల్లో బీసీ, ఓబీసీ రుణాల లబ్ధిదారుల ఇంటర్వ్యూలు* క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ మృతి మిస్టరీని తెలియజేయాలంటూ జిల్లాలో పలుచోట్ల శాంతి ర్యాలీలు* 46 బస్సులపై కేసులు విధించిన ఆర్టీఏ అధికారులు*
Similar News
News October 20, 2025
BNGR: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. అయితే వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (2,649) దరఖాస్తులు రాగా గతేడాది (3,900) దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.
News October 20, 2025
మంగళగిరి ఎయిమ్స్లో ఉద్యోగాలు

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 8 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 24లోపు దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్ను పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, డిప్లొమా, LLB, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
News October 20, 2025
దీపావళి: మీ ప్రాంతంలో ‘పేనీలు’ తింటారా?

దీపావళి అనగానే అందరికీ లక్ష్మీ పూజ, పటాసులే గుర్తొస్తాయి. కానీ తెలంగాణలో కొన్ని ఏరియాల్లో దీపావళి అంటే ‘పేనీలు’ తినాల్సిందే! అవును, ఈ స్వీట్ను ఎంతో ఇష్టంతో తినేవారు చాలామంది ఉంటారు. అమ్మవారికి కూడా ఇష్టమైన ఈ తీపి పదార్థాన్ని ముందుగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత వేడి పాలల్లో కలుపుకొని ఆరగిస్తారు. కొందరు టీలో కూడా వేసుకుంటారు. స్వర్గీయమైన రుచిగా చెప్పే ఈ ఆచారం మీ ప్రాంతంలో ఉందా? COMMENT