News March 27, 2025

ఏలూరు జిల్లాలో నాటి ప్రధాన వార్తలు

image

* పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు* పలు మండలాల్లో బీసీ, ఓబీసీ రుణాల లబ్ధిదారుల ఇంటర్వ్యూలు* క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ మృతి మిస్టరీని తెలియజేయాలంటూ జిల్లాలో పలుచోట్ల శాంతి ర్యాలీలు* 46 బస్సులపై కేసులు విధించిన ఆర్టీఏ అధికారులు*

Similar News

News July 6, 2025

పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

image

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ అన్నారు. బల్దియా కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం జరిగింది. బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో పన్ను వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వారు అధికారులకు సూచనలు చేశారు.

News July 6, 2025

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

image

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.