News March 18, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు జిల్లాలో ముగిసిన ఇంటర్ థియరీ పరీక్షలు
*శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
* పెదపాడు: MEO- టీచర్‌ను మందలించిన కలెక్టర్
*ఎంపీ కృషితో కుక్కునూరు- భద్రాచలం రోడ్డు పనులు ప్రారంభం
*నూజివీడు: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
*చింతలపూడి: బ్రిడ్జి కూలుతోందని యువకుల ధర్నా
*కామవరపుకోటలో బైక్ చోరీ
*అగిరిపల్లెలో షార్ట్ సర్క్యూట్.. కోళ్ల ఫారం దగ్ధం
*జీలుగుమిల్లిలో ఓ వ్యక్తిపై దాడి

Similar News

News November 4, 2025

గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

image

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్‌, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

News November 4, 2025

అభివృద్ధికి నోచుకోని కందగిరి.. బండరాళ్లే మెట్లు!

image

జిల్లాలోని కురవి(M) కందికొండ శివారు కందగిరి కొండపై ప్రాచీన కాలం నాటి కట్టడాలు ఉన్నా, అభివృద్ధి జాడ కనిపించడం లేదు. రెండున్నర కి.మీ. ఎత్తులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు బండరాళ్లే మెట్లుగా చేసుకుని ఎక్కుతున్నారు. గతంలో కేటీఆర్ ఇక్కడ మెట్లు నిర్మిస్తామని హామీ ఇవ్వగా, 2019లో శంకుస్థాపనతోనే ఆ పనులు నిలిచిపోయాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.

News November 4, 2025

నాలాను పరిశీలించిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించి నాలాను పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు వారు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేయర్ సూచనలు చేశారు.