News March 29, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*జంగారెడ్డిగూడెంలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి. *అగిరిపల్లి మండలంలో 50 లక్షల తో నిర్మించే సీసీ రోడ్లకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన.*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు నివ్వాలి :కలెక్టర్.*జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. *విశ్వకర్మ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించిన మంత్రి. *జంగారెడ్డిగూడెంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన.
Similar News
News December 5, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

సంగారెడ్డి జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.


